ఉద్యోగ సంఘం నేతల సమావేశానికి అనుమతించని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-21T18:03:39+05:30 IST

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతల సమావేశానికి ప్రభుత్వం అనుమతించలేదు.

ఉద్యోగ సంఘం నేతల సమావేశానికి అనుమతించని ప్రభుత్వం

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతల సమావేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. సచివాలయంలో కెబినెట్ మీటింగ్ జరుగుతున్నందున ఉద్యోగ సంఘం నేతల భేటీకి అనుమతించలేదు. దీంతో ఎన్జీవో హోంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు, బొప్పరాజు, సూర్యనారాయణ భేటీ అయ్యారు.


ప్రభుత్వానికి సమ్మె నోటీసిచ్చే దిశగా నిర్ణయం తీసుకుంటున్నందున ఉద్యోగ సంఘాల నేతల సమావేశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనైనా సమ్మె నోటీసు ఇచ్చేలాగానే కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నామని, సీఎస్ సమీర్ శర్మను కలుస్తామని చెప్పారు. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జీతాల బిల్లులను ప్రాసెస్ చేసేదిలేదని తమ ఉద్యోగులు స్పష్టంగా చెప్పారని, ఆప్షన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని ప్రయత్నించడం సరైంది కాదని బొప్పరాజు అన్నారు.

Updated Date - 2022-01-21T18:03:39+05:30 IST