నేడు సమావేశం కానున్న PRC సాధన సమితి

ABN , First Publish Date - 2022-01-21T17:02:10+05:30 IST

పీఆర్సీ సాధన సమితి సాయంత్రం 3 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ హాల్‌లో సమావేశం కానుంది.

నేడు సమావేశం కానున్న PRC సాధన సమితి

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలో సెక్యూరిటీ కారణంగా పీఆర్సీ సాధన సమితి సమావేశం వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ హాల్‌లో సమావేశం జరగనుంది. 4 సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు భేటీ కానున్నారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎవరి సంఘం నాయకులు వాళ్ల అంతర్గత సమావేశాల్లో ఉమ్మడి కార్యాచరణకు ఆమోదం తెలపనున్నారు. సాయంత్రం 3 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ ఆఫీసులో సమావేశం అయి.. 4 జేఏసీల నాయకులు ఉమ్మడి కార్యాచరణపై సంతకాలు చేయనున్నారు. అనంతరం నలుగురు చైర్మన్లు బండి శ్రీనివాసరావు, రామ సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు మీడియా సమావేశంలో ప్రకటన చేయనున్నారు.

Updated Date - 2022-01-21T17:02:10+05:30 IST