విజయసాయి రెడ్డికి సీఎం జగన్ షాక్

ABN , First Publish Date - 2022-04-20T16:54:01+05:30 IST

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు.

విజయసాయి రెడ్డికి సీఎం జగన్ షాక్

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. విశాఖ పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలను బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డిలకు మాత్రం 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయిరెడ్డికి మాత్రం బాధ్యతలు అప్పగించలేదు.


వైవీ సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. విశాఖ కేంద్రంగా నేటి వరకు పార్టీ, ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వహించిన విజయసాయిపై పార్టీలోని నేతలే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భూ ఆక్రమణలకు సంబంధించి పలు ఆరోపణలు.. అదే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతల నుంచి ఆరోపణలు రావడం.. దీనిపై పలుమార్లు పంచాయతీ జరిగిన సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  


ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాముఖ్యత పెరిగింది. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఇక విజయసాయి రెడ్డికి గతంలో ఉన్న పదవి అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి ఆయన తాడేపల్లి కేంద్రంగా పని చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-04-20T16:54:01+05:30 IST