భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-11-19T03:53:14+05:30 IST
అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు.
అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. వర్షాల ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అదేశించారు. తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను తెరవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.