ఏపీలో కొత్తగా 1,608 పాజిటివ్ కేసులు.. 15 మంది మృతి
ABN , First Publish Date - 2020-07-10T19:50:27+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,608 కరోనా పాజిటివ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,608 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏపీలో 1,576 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 25,422కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కోవిడ్ వల్ల 15 మంది మృతి మృతిచెందగా.. మొత్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 292 మందికి చేరింది. ప్రస్తుతం ఏపీలో 11,936 యాక్టివ్ కేసులు ఉండగా.. 13,194 మంది డిశ్చార్జ్ అయ్యారు.