ఏపీ కరోనా కేసులు.. తాజా బులెటిన్
ABN , First Publish Date - 2020-05-23T18:20:06+05:30 IST
ఏపీలోని కరోనా కేసుల తాజా బులెటిన్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది.
అమరావతి: ఏపీలోని కరోనా కేసుల తాజా బులెటిన్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,136 శాంపిల్స్ని పరీక్షించగా 47 మంది కోవిడ్19 పాజిటివ్గా తేలారు. 47 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసులకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.