YCP Govt.: మరో రూ.2 వేల కోట్లు అప్పు
ABN , First Publish Date - 2022-08-09T21:43:39+05:30 IST
వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) మరో రూ.2 వేల కోట్లు అప్పు చేసింది.
అమరావతి (Amaravathi): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) మరో రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) దగ్గర అధిక వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు (Security bonds) వేలం వేసి రూ.2 వేల కోట్లు అప్పు తీసుకుంది. అందులో వెయ్యి కోట్లు 14 సంవత్సరాలకు 7.97 శాతం వడ్డీకి రుణం తీసుకోగా.. రూ. 500 కోట్లు 9 ఏళ్లకు 7.74 శాతం వడ్డీకి, మరో రూ.500 కోట్లు 18 ఏళ్లకు గాను 7.96 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. కాగా 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు రుణం సేకరించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎం (FRBM) పరిధిలో...ఇంకా రూ. 18 వేలకోట్లు మాత్రమే బాండ్ల వేలం ద్వారా రుణం సమీకరించే అవకాశం ఉంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఏపీకి రూ.48 వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.