Loan Apps: ప్రజలకు ఉరితాళ్లుగా మారిన ఆన్లైన్ రుణ యాప్లు
ABN , First Publish Date - 2022-07-31T18:10:15+05:30 IST
టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఏపీ డీజీపీ కి లేఖ రాశారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, కొండెపి శాసనసభ్యుడు డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneyaswami) ఏపీ డీజీపీ (AP DGP)కి లేఖ (Letter) రాశారు. ఆన్లైన్ రుణ యాప్ (Online loan apps)లు ప్రజలకు ఉరితాళ్లుగా మారాయన్నారు. రుణాల పేరిట అమాయకుల మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. యాప్ల బారిన పడి.. బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఆత్మహత్యలు (Suicide) పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీఐ (RBI) అనుమతి లేకుండా రాష్ట్రంలో యధేచ్ఛగా ఆన్లైన్ రుణ యాప్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఆన్లైన్ రుణ యాప్లపై బ్యాన్ విధించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు బాల వీరాంజనేయస్వామి ఆ లేఖలో ప్రస్తావించారు.