ఆంధ్రప్రదేశ్ను ఆదానీ ప్రదేశ్గా మార్చుతున్నారు: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-11-06T21:26:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్ను ఆదానీ ప్రదేశ్గా మార్చుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ను ఆదానీ ప్రదేశ్గా మార్చుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోర్టుల నుంచి పరిశ్రమల వరకు ఆదానీకి సీఎం జగన్ దోచిపెడుతున్నారని ఆరోపించారు. రూ.5 వేలు విలువ చేసే బొగ్గుని రూ.20 వేలకి ఆదానీ నుంచి కొంటున్నారని తెలిపారు. ఆదానీ విద్యుత్ కొనుగోలు వల్ల లక్ష కోట్ల భారం పడుతోందన్నారు. గన్నవరం పోర్టు భూములను ఆదానీకి దోచిపెట్టడంలో జగన్రెడ్డి కమీషన్ ఎంతో చెప్పాలి? అని రామకృష్ణ ప్రశ్నించారు.