ట్రాక్టర్ నడిపిన మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2020-04-03T21:59:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య శుక్రవారంనాడు స్వయంగా ట్రాక్టర్ నడిపారు. మచిలీపట్నంలో సోడియం హైపోక్లోరైట్ ..

ట్రాక్టర్ నడిపిన మంత్రి పేర్ని

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య శుక్రవారంనాడు స్వయంగా ట్రాక్టర్ నడిపారు. మచిలీపట్నంలో సోడియం హైపోక్లోరైట్ చల్లుతున్న ట్రాక్టరును ఆయన కొద్దిసేపు నడిపారు. కోవిడ్ వైరస్‌ సోకకుండా మందుజాగ్రత్తగా మచిలీపట్నం మండలంలోని 34 గ్రామాల్లో స్ప్రే ట్యాంకర్‌ ద్వారా హైపోక్లోరైట్ చల్లుతున్నారు. ఈ స్ప్రే ట్యాంకర్‌ను ట్రాక్టరులో ఉంచి ఊరూరా తీసుకువెళ్లుతున్నారు. మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ, పలు ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు ఇస్తూ ముందుకు సాగారు.

Updated Date - 2020-04-03T21:59:13+05:30 IST