ఆంధ్రజ్యోతి సేవలు భేష్‌

ABN , First Publish Date - 2021-02-25T08:43:52+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం చింతలగట్టు, వట్టేవాగు సమ్మక్క-సారలమ్మ జాతరలో ఐదేళ్లుగా ఆంధ్రజ్యోతి చేస్తున్న సేవలను మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశంసించారు.

ఆంధ్రజ్యోతి సేవలు భేష్‌

ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, సీతక్క

మహబూబాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం చింతలగట్టు, వట్టేవాగు సమ్మక్క-సారలమ్మ జాతరలో ఐదేళ్లుగా ఆంధ్రజ్యోతి చేస్తున్న సేవలను మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశంసించారు. మినీ మేడారం జాతరగా వర్ధిల్లుతున్న చింతలగట్టు, వట్టేవాగు జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గతంలో ఇక్కడ పనిచేసిన ఇన్‌చార్జి, ప్రస్తుత మణుగూరు తహసీల్దార్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి సహకారంతో ఆంధ్రజ్యోతి ఉచితంగా తాగునీరు, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. వీటిని ఎమ్మెల్యేలు బానోత్‌ శంకర్‌నాయక్‌, సీతక్క ప్రారంభించారు. అనంతరం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

Updated Date - 2021-02-25T08:43:52+05:30 IST