గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి మృతి
ABN , First Publish Date - 2021-04-19T05:23:58+05:30 IST
కె.కోటపాడు మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు (ఆంధ్రజ్యోతి), చోడవరం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్క్లబ్ అధ్యక్షుడు గాలి రాజశేఖర్ (38) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు.
మాడుగుల, ఏప్రిల్ 18: కె.కోటపాడు మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు (ఆంధ్రజ్యోతి), చోడవరం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్క్లబ్ అధ్యక్షుడు గాలి రాజశేఖర్ (38) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మందులు తీసుకుంటూ ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంటి మేడపై నుంచి కిందకు దిగుతుండగా కళ్లు తిరిగి పడి పోయారు. ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతుండగా ప్రాణాలు కోల్పోయారు. రాజశేఖర్కి తల్లిదండ్రులతోపాటు భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలు శ్రావ్యశ్రీ (11), భవ్యశ్రీ (8) ఉన్నారు. రాజశేఖర్ మృతిపట్ల పలువురు పాత్రికేయులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.