ఈఎన్‌సీని సందర్శించిన అండమాన్‌ కమాండ్‌ చీఫ్‌

ABN , First Publish Date - 2022-05-21T06:34:14+05:30 IST

: అండమాన్‌, నికోబార్‌ త్రివిధ దళాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ అజయ్‌సింగ్‌ మూడు రోజుల పర్యటనకు నగరానికి చేరుకున్నారు. అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌కు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా 2021 జూన్‌ 1న బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన నగరానికి విచ్చేశారు.

ఈఎన్‌సీని సందర్శించిన అండమాన్‌ కమాండ్‌ చీఫ్‌

విశాఖపట్నం, మే 20: అండమాన్‌, నికోబార్‌ త్రివిధ దళాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌  అజయ్‌సింగ్‌ మూడు రోజుల పర్యటనకు నగరానికి చేరుకున్నారు. అండమాన్‌ నికోబార్‌  కమాండ్‌కు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా 2021 జూన్‌ 1న బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన నగరానికి విచ్చేశారు.  తూర్పునావికాదళం చీఫ్‌ ఆఫ్‌ ద స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ వాత్సాయన్‌ ఆయనకు స్వాగతించారు. శుక్రవారం వీరిరువురూ తూర్పు నావికాదళం అడ్మినిస్ట్రేషన్‌ భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈస్టర్న్‌ సీ బోర్డులో ఇండియన్‌ నేవీ ఆపరేషనల్‌ కార్యకలాపాలపై సంజయ్‌ వాత్సాయన్‌ వివరించారు.

Updated Date - 2022-05-21T06:34:14+05:30 IST