ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2022-05-23T03:21:54+05:30 IST

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు కారణమైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలని దళిత సంఘర్షణ

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలని ధర్నా
అల్లూరులో ధర్నా చేస్తున్న దళిత నేతలు

కావలి(అల్లూరు), మే22: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు కారణమైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును  అరెస్ట్‌ చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అద్యక్షుడు ఎస్‌. మల్లి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అల్లూరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సమితి నాయకులు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ జగనన్న రాజ్యంలో బడుగు, బలహీనవర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళిత యువకుడిని చంపిన వారెవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపటానికి కారణాలేమిటి , వారి వెనుక ఉన్న నాయకులు ఎవరు...? అందరిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  నిందితులందరిని  అరెస్ట్‌ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నేతలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T03:21:54+05:30 IST