రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2022-07-04T05:12:10+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోం దని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎం కొండయ్య ధ్వజమె త్తారు.
టీడీపీ ఇన్చార్జి కొండయ్య ధ్వజం
వేటపాలెం(చీరాల), జూలై 3: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోం దని టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎం కొండయ్య ధ్వజమె త్తారు. ఆదివారం రాత్రి వేటపాలెం మండలం రామన్నపేట పంచాయ తీ పరిధిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం అందరిపై ఉందన్నారు. అం దుకు టీడీపీ శ్రేణులు ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని పిలుపుని చ్చారు. విద్యుత్ చార్జీల నుంచి ఆర్టీసీ చార్జీల వరకు అన్నింటిని పెంచి సామాన్యుల నడ్డివిరిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం తో వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ నిత్యా వసర సరుకులు నింగినంటడంతో మహిళలు ఏవిధంగా ఇబ్బంది ప డుతుంది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాశిక వీరభద్రయ్య, భరత్, సుభాని, ఽశివప్ర సాదరావు, మల్లికార్జునరావు, తులసీదాసు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెంచిన నిత్యావసర ధరలపై నిరసన
గంగవరం(ఇంకొల్లు), జులై3: పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు, పెట్రో ధరలు వెంటనే తగ్గించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశా రు. ఆదివారం మండలంలోని గంగవరం గ్రామంలో బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్య క్షుడు నాయుడు హనుమంతరావు మాట్లాడుతూ నిత్యవసరాల ధర లు పెంచి సామాన్యమానవులపై భారంమోపిన వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకట్రావు, బేతపూడి సురేష్బాబు ,కరి శ్రీనివాసరావు, బోడెంపూడి సు బ్బారావు, కరి వీరాంజనేయులు, వీరారెడ్డి, ఆదినారాయణ, కరి రా మారావు, వాసుబాబు, రమేష్, బ్రహ్మయ్య, పవన్ పాల్గొన్నారు.