Ananthapuram: పెన్షన్ అడిగితే కొడతారా..?

ABN , First Publish Date - 2022-07-05T00:39:52+05:30 IST

అధికార పార్టీ నేతల అండతో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు..పెన్షన్ డబ్బులు అడిగిందని..

Ananthapuram: పెన్షన్ అడిగితే కొడతారా..?

అనంతపురం(Ananthapuram): అధికార పార్టీ నేతల అండతో వాలంటీర్లు రెచ్చిపోతున్నారు..పెన్షన్ డబ్బులు అడిగిందని ఓ వితంతువును తల పగిలేలా కొట్టారు వాలంటీర్ (Volunteer)కుటుంబ సభ్యులు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో చోటు చేసుకుంది. పొడరానుకు చెందిన కొడవకళ్లు రమాదేవి (Ramadevi) టీడీపీ (Tdp) సానుభూతి పరురాలు. భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయారు. కొంతకాలంగా ఆమెకు రావాల్సిన వితంతు పెన్షన్ డబ్బులకు వాలంటీర్ సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ఈ నెల పెన్షన్ డబ్బులు ఒకటో తేదీనే ఇవ్వాల్సి ఉండగా సమయానికి ఇవ్వలేదు. తనకు రావాల్సిన పెన్షన్ డబ్బులను ఇవ్వాలని రమాదేవి వాలంటీర్‌ను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇష్టమున్నప్పుడు ఇస్తానని.. అసలు పెన్షన్ ఇవ్వనని.. దిక్కున్న చోట చేప్పుకో అంటూ చిందులేశాడు. 


అదేరోజు సాయంత్రం వాలంటీర్ ఆమె తండ్రి రోశయ్య (Rosaiah),బంధువులు సాయి భాస్కర్ (Bhaskar), హనుమంతు (Hanmantu), లక్ష్మక్క కలిసి రమాదేవిపై దాడికి పాల్పడ్డారు. కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన రమాదేవి కుమార్తె సరస్వతి బంధువులు రాజు, చంద్రమోహన్ పైనా దాడి చేశారు. వారందరికీ తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. 


రమాదేవి కుటుంబంపై దాడికి పాల్పడటమే కాకుండా వైసీపీ నేతలతో కలిసి బాధితులపైనే పోలీసులకు వాలంటీర్  కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని..అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతల అండతోనే వాలంటీర్లు రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడటమే కాకుండా తిరిగి బాధితులపై కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. 




Updated Date - 2022-07-05T00:39:52+05:30 IST