ఆలయాలు, ప్రార్థన మందిరాలపై ప్రత్యేక నిఘా
ABN , First Publish Date - 2020-09-27T08:17:15+05:30 IST
జిల్లావ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థన మందిరాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డీఎస్పీల ఆధ్వర్యంలో శనివారం ఆయా ప్రాంతాల ఆలయాలు, మసీదులు, ప్రార్థన...
60 మంది ఆలయాల దొంగలు, పాత నేరస్థుల బైండోవర్
అనంతపురం క్రైం, సెప్టెంబరు: జిల్లావ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థన మందిరాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డీఎస్పీల ఆధ్వర్యంలో శనివారం ఆయా ప్రాంతాల ఆలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, 180 కమిటీలను ఏర్పాటు చేశారు. 60 మంది ఆలయ దొంగలు, పాత నేరస్ధులను బైండోవర్ చేసి, కౌన్సిలింగ్ చేశారు. దేవాలయాలు, మసీదులు, ప్రార్థన మందిరాల నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచుతామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలియజేశారు.