ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ నుంచి ప్రమాదం ఉంది: సుబ్రహ్మణ్యం తండ్రి
ABN , First Publish Date - 2022-06-18T01:58:34+05:30 IST
ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ నుంచి తమ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ గవర్నరుకు
విజయవాడ: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ నుంచి తమ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ గవర్నరుకు విన్నవించుకున్నారు. ఆయనతోపాటు పలువురు దళిత సంఘ నాయకులు విజయవాడ రాజ్భవన్లో గవర్నరు హరిచందన్ను శుక్రవారం కలిశారు. హత్య జరిగిన తీరు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గవర్నరుకు వివరించారు. అనంతరం రాజ్భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. అనంత ఉదయ్ భాస్కర్ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కోరారు. కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అనంత ఉదయ భాస్కర్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంతో తమ కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసులో తప్పుగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ జరపాలని కోరారు