అనంతపురంలో టెన్షన్ టెన్షన్.. గాయపడ్డ జయలక్ష్మి అదృశ్యం..తెలియదంటున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-11-09T15:54:41+05:30 IST
అనంతపురం: నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఎస్బీఎన్ కాలేజీలో లాఠీ చార్జ్కు వ్యతిరేకంగా...
అనంతపురం: నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఎస్బీఎన్ కాలేజీలో లాఠీ చార్జ్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు బంద్కు పిలుపు ఇచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తరలించారు. మరోవైపు నిన్న లాఠీ చార్జ్లో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. దీంతో తోటి విద్యార్థులు, బంధువులు ఆందోళనలో పాల్గొన్నారు. అటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో స్పెషల్ పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. కాగా ఎస్ఎస్బీఎన్ కాలేజీ యాజమాన్యం ఇవాళ, రేపు సెలవు ప్రకటించింది.