కరెంట్ బిల్లుపై ప్రశ్నించిన ఓ మహిళకు MLA ఘాటైన సమాధానం

ABN , First Publish Date - 2022-06-08T18:25:12+05:30 IST

కరెంట్ బిల్లుపై ప్రశ్నించిన ఓ మహిళకు ఎమ్మెల్యే (MLA) ఘాటైన సమాధానం చెప్పారు.

కరెంట్ బిల్లుపై ప్రశ్నించిన ఓ మహిళకు MLA ఘాటైన సమాధానం

Anantapuram జిల్లా: కరెంట్ బిల్లుపై ప్రశ్నించిన ఓ మహిళకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavati) ఘాటైన సమాధానం చెప్పారు. ‘మీ ఇంటికి లక్షలు ఇస్తే.. వందలు కట్టలేరా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎదరు ప్రశ్నతో ఆ మహిళకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, సింగనమలలో చోటు చేసుకుంది. సింగనమల నియోజకవర్గం, గార్లిదిన్నె మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ప్రజలు పలు సమస్యలను ఏకరువుపెట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ మండల కన్వీనర్ నరేందర్ రెడ్డి జోక్యం చేసుకుని అన్నీ చేసేస్తామని చెప్పారు. ఆయన తీరుతో విసుకుచెందిన మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో నరేందర్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు.

Updated Date - 2022-06-08T18:25:12+05:30 IST