Anantapuram జిల్లా: ఓ ఆలయ ప్రధాన అర్చకుడి రాసలీలలు..

ABN , First Publish Date - 2022-07-12T23:50:09+05:30 IST

అనంతపురం (Anantapuram) జిల్లా: ఓ ఆలయ ప్రధాన అర్చకుడి రాసలీలల బండారం బయటపడింది.

Anantapuram జిల్లా: ఓ ఆలయ ప్రధాన అర్చకుడి రాసలీలలు..

అనంతపురం (Anantapuram) జిల్లా: ఓ ఆలయ ప్రధాన అర్చకుడి రాసలీలల బండారం బయటపడింది. ఆలయానికి పూజల కోసం వచ్చే మహిళలు (womens), యువతులను (young girls) తన మంత్ర శక్తులతో వశీకరణ చేసి.. లైంగిక కోరికలు (Sexual desires) తీర్చుకుంటున్నట్లు అర్చకుడి భార్య ఆరోపించడం కలకలం రేపింది. నంద్యాల జిల్లా, రంగాపురం గ్రామానికి చెందిన స్రవంతి (Sravanti)కి అనంతపురం జిల్లా మురిడి ఆలయ ప్రధాన అర్చకుడు అనంతసేన (Anantasena)తో 2008లో వివాహం అయింది. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఆలయానికి వచ్చిన కొందరు మహిళలు, యువతులతో రాసలీలలు కొనసాగిస్తున్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలను అర్చకుడి భార్య బయటపెట్టింది. తనను ఏడేళ్లుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది.


అక్రమ సంబంధాలపై ప్రశ్నించినందుకు తనను ఎన్నోసార్లు దాడి చేసి.. పుట్టింటికి పంపినట్లు స్రవంతి వాపోయింది. అక్రమ సంబంధాల మోజులో పడి విడాకుల నోటీసులు కూడా పంపాడని ఆమె తెలిపింది. విడాకుల నోటీసులపై చర్చించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి మురిడి గ్రామానికి వెళ్లగా కిరాయి గూండాలతో దాడి చేయించారని ఆమె చెప్పింది. అంతేకాదు రాసలీలలకు అడ్డుపడుతున్నాననే నేపంతో తనను హతమార్చేందుకు కూడా భర్త కుట్రపన్నాడని స్రవంతి ఆరోపించింది.

Updated Date - 2022-07-12T23:50:09+05:30 IST