ప్రభుత్వ భూములు పంచడంపై అధికారుల సీరియస్

ABN , First Publish Date - 2021-06-11T21:27:01+05:30 IST

అనంతపురం జిల్లా: కొత్త చెరువు మండలం తహసీల్దార్ రామచంద్రప్ప ప్రభుత్వ భూములు పంచడంపై...

ప్రభుత్వ భూములు పంచడంపై అధికారుల సీరియస్

అనంతపురం జిల్లా: కొత్త చెరువు మండలం తహసీల్దార్ రామచంద్రప్ప ప్రభుత్వ భూములు పంచడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూముల్ని పంచేశారన్న కథనాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పలు కథనాలను ప్రచారం చేసింది. ఈ కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు తక్షణమే జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చాలని విచారణకు ఆదేశించారు. ఆర్డీవో పర్యవేక్షణలో ముగ్గురు తాహసీల్దారులను నియమించడంతో వెంటనే ఈ బృందం రంగంలోకి దిగింది.


అధికారుల విచారణలో తహసీల్దార్ రామచంద్రప్ప 26 ఎకరాలకు సంబంధించి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. గుర్తించిన అన్ని భూములను బ్లాక్ లిస్టులోకి చేర్చారు. మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తహసీల్దార్ బృందం రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. మండల వ్యాప్తంగా ఇంకా ఏమైనా అక్రమాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే అవినీతి బాగోతంలో ఇద్దరు వీఆర్వోలు కీలక పాత్ర పోషించారు. వారిపై కూడా లోతైన విచారణ చేయాలని అధ్యయన కమిటీ భావిస్తోంది.

Updated Date - 2021-06-11T21:27:01+05:30 IST