‘కుమార్తె ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకుంటా అనుమతివ్వండి’

ABN , First Publish Date - 2021-04-14T19:41:45+05:30 IST

అనంతపురం: కుమార్తె ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకుంటా అనుమతివ్వాలంటూ...

‘కుమార్తె ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకుంటా అనుమతివ్వండి’

అనంతపురం: కుమార్తె ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కిడ్నీలు అమ్ముకుంటా అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా, హిందూపురంకు చెందిన మక్బుల్ జాన్, ఆయూబ్ ఖాన్ దంపతులు కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో తమ కుమార్తె రుబియా ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోందన్నారు. అయితే విదేశీ ఉన్నత విద్య స్కాలర్ షిప్ మంజూరు కాలేదని, దాని కోసం రెండు నెలలుగా  ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని ఆ దంపతులు వాపోయారు. ఈనెల 17వతేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండటంతో కిడ్నీలు అమ్మకానికి అనుమతించాలని రుబియా తల్లిదండ్రులు కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.

Updated Date - 2021-04-14T19:41:45+05:30 IST