AP: కొనకొండ్లలో మరోసారి దాడులకు తెగబడ్డ శివరామిరెడ్డి వర్గీయులు
ABN , First Publish Date - 2022-01-16T18:47:16+05:30 IST
జిల్లాలోని కొనకొండ్లలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు మరోసారి దాడులకు తెగబడ్డారు.
అనంతపురం: జిల్లాలోని కొనకొండ్లలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు మరోసారి దాడులకు తెగబడ్డారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూమిలో శివరామిరెడ్డి దౌర్జన్యంగా బావి తవ్వకం పనులు చేపట్టారు. అయితే సర్వే చేయించి బావి తవ్వుకోవాలంటూ మరో వర్గానికి చెందిన వ్యక్తులు సూచించారు. దీంతో ‘‘మమ్మల్ని ప్రశ్నిస్తారా’’ అంటూ శివరామిరెడ్డి రెడ్డి వర్గీయులు రాళ్లతో దాడికి దిగింది. మరోవర్గం వారు భయంతో ఇళ్లలో తలదాచుకున్నప్పటికీ వదలకుండా రాళ్లదాడి చేశారు. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటూ శివరామిరెడ్డి వర్గీయులు రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో కొనకొండ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.