అనంతపురంలో వైసీపీ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2021-09-15T19:11:10+05:30 IST

జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు.

అనంతపురంలో వైసీపీ నేతల ఆందోళన

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ చేసిన బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు ఆందోళన కొనసాగుతోంది. ఎంపీడీవో కార్యాలయంలోనే వైసీపీ నేతలు రాత్రి నిద్రించారు. కాగా ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 

Updated Date - 2021-09-15T19:11:10+05:30 IST