TDP Leaders: అనంతపురంలో టీడీపీ నేతల బృందం పర్యటన

ABN , First Publish Date - 2022-08-11T16:35:27+05:30 IST

జిల్లాలో టీడీపీ నేతల బృందం పర్యటన కొనసాగుతోంది.

TDP Leaders: అనంతపురంలో టీడీపీ నేతల బృందం పర్యటన

అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల (TDP Leaders) బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా రోడ్లపై పడేసిన టమోటాలను టీడీపీ నేతలు పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు(Kalva srinivasulu) మాట్లాడుతూ... టమోటా రైతుల (Tomato farmers) పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పంటలకు కనీస ధర కూడా రావడం లేదని తెలిపారు. 15 కిలోల బాక్స్ రూ.60 ధర పలికితే రవాణా ఖర్చు కూడా రాదన్నారు. రైతుల(Farmers) బాధలను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. కొనేవారే లేక టమోటాలను రోడ్లపై పడేస్తున్నారన్నారు. ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని అన్నారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏమైందో జగన్ చెప్పాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-11T16:35:27+05:30 IST