శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రఘువీరా

ABN , First Publish Date - 2021-04-21T18:51:05+05:30 IST

జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రఘువీరా

అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవలసి వచ్చిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాముని జీవితం ఆదర్శప్రాయమైనదని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిని నియబద్ధ జీవనంతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-04-21T18:51:05+05:30 IST