ATP : భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2022-03-06T15:04:31+05:30 IST

అనంతపురం : జిల్లాలోని సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో దారుణం జరిగింది.

ATP : భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

అనంతపురం : జిల్లాలోని సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్య లక్ష్మీదేవిని అతి కిరాతికంగా భర్త నరసింహులు హత్య చేశాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. మనస్పర్థలతోనే దారుణంగా హత్య చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా.. పెరుగుపాళ్యం చేరుకుని నరసింహులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందని పోలీసులు ఈ ఘటనపై ఆరాతీస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-03-06T15:04:31+05:30 IST