పెనుకొండ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీ Gorantla హల్‌చల్

ABN , First Publish Date - 2021-11-15T15:24:15+05:30 IST

జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హల్ చల్ చేశారు.

పెనుకొండ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీ Gorantla హల్‌చల్

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హల్‌చల్ చేశారు. అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లిన గోరంట్ల ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే  పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అక్కడికి చేరుకున్నారు. పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎంపీ లెక్క చేయకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే  పార్థసారథిని అడ్డుకున్న పోలీసులు గోరంట్ల మాధవ్‌కు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పోలీసుల తీరుపై పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-15T15:24:15+05:30 IST