అనంతపురంలో పరిటాల సునీత నిరసన
ABN , First Publish Date - 2022-03-14T19:26:38+05:30 IST
రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన ప్రదర్శనకు దిగారు.
అనంతపురం: రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన ప్రదర్శనకు దిగారు. రామగిరి మండల కేంద్రంలో 100 ట్రాక్టర్లతో రైతులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో నిరసన చేపట్టారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరసనలో పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగానే 90 శాతం సబ్సిడీతో డ్రిప్ స్ప్రింక్లర్లు అందజేయాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.