హంద్రీనీవా కాలువపై ఎమ్మెల్యే పయ్యావుల నిరసన

ABN , First Publish Date - 2022-02-15T19:34:57+05:30 IST

హంద్రీనీవా కాలువపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి హంద్రీనీవా కాలువపై నిరసన చేపట్టారు.

హంద్రీనీవా కాలువపై ఎమ్మెల్యే పయ్యావుల నిరసన

అనంతపురం: హంద్రీనీవా కాలువపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి హంద్రీనీవా కాలువపై నిరసన  చేపట్టారు. పంటలకు అర్ధాంతరంగా నీటిని నిలిపివేసిన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో సుమారు 50 వేల ఎకరాల్లో వేరుశనగ మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-15T19:34:57+05:30 IST