అనంతపురంలో జనసేన నేత మధుసూదన్ రెడ్డి పాదయాత్ర
ABN , First Publish Date - 2022-02-14T18:47:05+05:30 IST
ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు.
అనంతపురం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. 1953 ముందు ఏర్పడిన ధర్మవరం రెవెన్యూ డివిజన్ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తి జిల్లాకు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. ధర్మవరంలోనూ రెవెన్యూ డివిజన్, ఇతర డివిజన్ కార్యాలయాలు కొనసాగే విధంగా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ నేతలు ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే రెవెన్యూ డివిజన్ కోసం న్యాయ పోరాటం చేస్తామని మధుసూదన్ రెడ్డి తెలిపారు.