Anantapur: బెంగళూరు వెళ్లే పలు రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2021-12-09T14:55:14+05:30 IST

గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

Anantapur: బెంగళూరు వెళ్లే పలు రైళ్లు రద్దు

అనంతపురం: గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. యలహంక - పెనుకొండ శిక్షణలు డబ్లింగ్ లైన్ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్... సోలాపూర్ హ సన్ ఎక్స్‌ప్రెస్ రద్దు అయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే మరో ఆరు ట్రైన్‌లను పాక్షికంగా రద్దు అవగా... 12 రైళ్లను దారి మళ్లించింది. కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

Updated Date - 2021-12-09T14:55:14+05:30 IST