Anantapur: హెచ్‌ఎల్సీ కాలువలో యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2021-11-30T16:23:15+05:30 IST

జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలో యువకుడు గల్లంతయ్యాడు.

Anantapur: హెచ్‌ఎల్సీ కాలువలో యువకుడు గల్లంతు

అనంతపురం: జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పాండురంగ స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా రాయదుర్గం పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు  పూజ కోసం వెళ్లారు. ఈ క్రమంలో దేవాలయ సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలో స్నానం చేస్తూ వెంకటేశులు( 25)అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-11-30T16:23:15+05:30 IST