Anantapur: మహిళపై గ్రామ వాలంటీర్ దాడి
ABN , First Publish Date - 2021-11-22T18:47:15+05:30 IST
జిల్లాలోని గుమ్మగట్ట మండల కేంద్రంలో బోయ ఓబక్క అనే మహిళపై గ్రామ వాలంటీర్ ఉప్పర రాజశేఖర్ దాడి చేశారు.
అనంతపురం: జిల్లాలోని గుమ్మగట్ట మండల కేంద్రంలో బోయ ఓబక్క అనే మహిళపై గ్రామ వాలంటీర్ ఉప్పర రాజశేఖర్ దాడి చేశారు. జగనన్న చేయూత కింద మంజూరైన డబ్బుల్లో రూ.5 వేలు ముడుపులు ఇవ్వాలని రాజశేఖర్ వేధింపులకు గురి చేశాడు. వాలంటీర్ దాడితో బోయ ఓబక్క సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.