AP: రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో పెరుగుతున్న మృతుల

ABN , First Publish Date - 2021-11-20T14:42:51+05:30 IST

కదిరి పట్టణంలో రెండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికి తీశారు.

AP: రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో పెరుగుతున్న మృతుల

అనంతపురం: కదిరి పట్టణంలో రెండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో రెండు మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 


కదిరిలోని పాత చైర్మన్ వీధిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా... మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. భవనం శిథిలాల కింద 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-11-20T14:42:51+05:30 IST