Anantapur: తలుపుల ఎంపీడీవో, సిబ్బంది విధులకు హాజరు

ABN , First Publish Date - 2021-09-01T16:55:14+05:30 IST

సామూహిక సెలవును విరమించుకుంటూ తలుపుల ఎంపీడీవో, సిబ్బంది బుధవారం విధులకు హాజరయ్యారు.

Anantapur: తలుపుల ఎంపీడీవో, సిబ్బంది విధులకు హాజరు

అనంతపురం: సామూహిక సెలవును విరమించుకుంటూ తలుపుల ఎంపీడీవో, సిబ్బంది బుధవారం విధులకు హాజరయ్యారు. సామూహిక సెలవు కోరుతూ ఎంపీడీవో దరఖాస్తు చేయడంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విష్ణు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సామూహిక సెలవు కోరుతూ  దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఒత్తిళ్లను భరించలేక సిబ్బంది మొత్తం సామూహిక సెలవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల హామీ మేరకు సామూహిక సెలవును విరమించుకున్నామని చెప్పారు. ఇక నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన అందిస్తామని ఎంపీడీవో విష్ణుప్రసాద్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-09-01T16:55:14+05:30 IST