Anantapur: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-26T12:13:15+05:30 IST

ముదిగుబ్బ-బుక్కపట్నం రహదారిలో చండ్రా యునిపల్లి గ్రామ సమీపంలో బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమా దంలో మణిబాబు(28) మృతిచెందాడు. ఎస్‌ఐ నరసింహుడు

Anantapur: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అనంతపురం: ముదిగుబ్బ-బుక్కపట్నం రహదారిలో చండ్రా యునిపల్లి గ్రామ సమీపంలో బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమా దంలో మణిబాబు(28) మృతిచెందాడు. ఎస్‌ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని గూనిపల్లి గ్రామానికి చెందిన మణిబాబు ద్విచక్ర వాహ నంలో బుక్కపట్నం కు వస్తుండగా ఇదే రహదారిలో పులివెందుల నుండి బెంగు ళూర్‌కు అరటిగెల లోడుతో వెళ్తు న్న ఏపీ 39 టీవీ-3462 నెంబర్‌గల బొలెరో వాహనం ముందు వెళ్తున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో మణిబాబు అక్కడి కక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌ బొలెరో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-07-26T12:13:15+05:30 IST