వైసీపీ ముఖ్య నేతలకు ఆనందయ్య మందు పంపిణీ
ABN , First Publish Date - 2021-06-20T05:00:50+05:30 IST
కరోనాకు సంబంధించి ఆనందయ్య ఆయుర్వేద మందు జిల్లాలో అందరికీ పంపిణీ చేసేలా కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి తెలిపారు.
కడప (ఎర్రముక్కపల్లె), జూన్ 19 : కరోనాకు సంబంధించి ఆనందయ్య ఆయుర్వేద మందు జిల్లాలో అందరికీ పంపిణీ చేసేలా కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి తెలిపారు. జిల్లా కార్యాలయంలో శనివారం ఆయుర్వేద మందులను ముఖ్య నేతలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనకు 1500 ప్యాకెట్లను పంపించారన్నారు. ప్రస్తుతం తమ పార్టీ ముఖ్య నేతలకు ఇస్తున్నామని, ఆనందయ్య సహకారంతో ఇక్కడే మందులు తయారు చేయించి జిల్లా ప్రజలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు సునీల్కుమార్, గుమ్మా రాజేంద్రప్రసాద్రెడ్డి, కమలాపురం నాయకులు పాల్గొన్నారు,
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వీరపునాయునిపల్లె, జూన్ 19: రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం ముందుకెళ్తోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని తలపనూరు గ్రామంలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథ కం ద్వారా మంజూరైన కందుల మినీ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో రఘునాథ్రెడ్డి, మారుతిరెడ్డి, వనజ, శివబాష తదితరులు పాల్గొన్నారు.