ఆయుర్వేద మందు పంపిణీ
ABN , First Publish Date - 2021-06-15T05:54:28+05:30 IST
ఆనందయ్య ఫార్ములాతో తయారు చేసిన ఆయుర్వేద మందుకోసం ప్రజ లు బారులు తీరారు
పలమనేరు రూరల్, జూన్ 14 : ఆనందయ్య ఫార్ములాతో తయారు చేసిన ఆయుర్వేద మందుకోసం ప్రజలు బారులు తీరారు. సోమవారం పలమనేరు మండలంలోని కొలమాసనపల్లెలో రత్న బయోటిక్ ఎండీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందయ్య ఫార్ములాలో ఉన్న మనమూలికలను సేకరించి కొవిడ్ నివారణ ఆయుర్వేద మందును తయారు చేశామన్నారు. ప్రయోగాత్మకంగా ఇద్దరు కొవిడ్ బాధితులకు అందించి రెండు రోజుల తరువాత పరీక్షిస్తే నెగిటివ్ వచ్చిందన్నారు. సోమవారం 700 మందికి ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రత్నా బయోటిక్ అధినేత రత్నారెడ్డి, ఆయుర్వేద డాక్టర్ శాంతకుమార్ పాల్గొన్నారు.