నా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు: ఆనందబాబు

ABN , First Publish Date - 2021-10-19T20:03:45+05:30 IST

విశాఖ ఏజెన్సీ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు.

నా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు: ఆనందబాబు

గుంటూరు: మాదకద్రవ్యాలపై మీడియా సమావేశంలో మాట్లాడిన అంశానికి సంబంధించి విశాఖ ఏజెన్సీ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియాలో మాట్లాడిన అంశాలపై ఆధారాలివ్వాలని అడిగారన్నారు. తలా తోకా లేని ప్రశ్నలు వేసి సమాధానం ఇవ్వమన్నారని తెలిపారు. దీంతో వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ చూపించానన్నారు. తన స్టేట్‌మెంట్‌ను నర్సీపట్నం పోలీసులు రికార్డ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను నీరుగారుస్తున్నారని విమర్శించారు. తన కార్యకర్తలను బెదిరించడానికే పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రూ.8వేల కోట్ల విలువైన గంజాయి పండిస్తున్నారని ఆనందబాబు అన్నారు.

Updated Date - 2021-10-19T20:03:45+05:30 IST