కాదేదీ కళకనర్హం: పుల్ల ఇడ్లీపై ఆనంద్ మహీంద్ర

ABN , First Publish Date - 2021-10-01T22:03:33+05:30 IST

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర. ఆసక్తికరమైన వ్యాఖ్యలు, కొన్ని జోకులతో నెటిజెన్లను ఆకట్టుకుంటూ ఉంటారు. వాటితో పాటు కొత్త కొత్త విషయాలను, కొన్ని అనుభవాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు..

కాదేదీ కళకనర్హం: పుల్ల ఇడ్లీపై ఆనంద్ మహీంద్ర

ముంబై: సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర. ఆసక్తికరమైన వ్యాఖ్యలు, కొన్ని జోకులతో నెటిజెన్లను ఆకట్టుకుంటూ ఉంటారు. వాటితో పాటు కొత్త కొత్త విషయాలను, కొన్ని అనుభవాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వినూత్న వంటకం నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పుల్ల ఐస్ తరహాలో పుల్ల ఇడ్లీలు రూపొందించారు బెంగళూరుకు చెందిన వారు. పుల్లకు గుచ్చిన ఇడ్లీలు పక్కనే రెండు కప్పుల్లో చట్నీ, సాంబార్ ఉన్న ఒక ఫోటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘వినూత్న ఆవిష్కరణలకు కేంద్రమైన బెంగళూరు నగరం.. తన సృజనాత్మకతను ఆపుకోలేకపోతోంది’’ అని ట్వీట్ చేశారు.



Updated Date - 2021-10-01T22:03:33+05:30 IST