మరోసారి వేడెక్కిన నెల్లూరు రూరల్ రాజకీయాలు

ABN , First Publish Date - 2022-01-23T20:53:20+05:30 IST

నెల్లూరు: రూరల్ రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. కోడూరుపాడు, పెన్నానది సమీపంలో...

మరోసారి వేడెక్కిన నెల్లూరు రూరల్ రాజకీయాలు

నెల్లూరు: రూరల్ రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. కోడూరుపాడు, పెన్నానది సమీపంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు 30 ఎకరాల్లో అక్రమంగా లే అవుట్లు వేశారు. కొన్నాళ్లుగా ఆ భూముల్లో స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతులను బెదిరించి, భయపెట్టి అక్కడి నుంచి తరిమికొట్టారు. విషయం తెలుసుకున్న ఆనం విజయకుమార్ రెడ్డి స్థానికులతో కలిసి ఆ ప్రాంతాన్ని పర్యటించారు. దీంతో కోటం రెడ్డి, విజయకుమార్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీలో వర్గ విబేధాలు, ఆ పార్టీ శ్రేణుల అక్రమాలు ఈ ఘటనతో వెలుగు చూశాయి.

Updated Date - 2022-01-23T20:53:20+05:30 IST