‘బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడింది’

ABN , First Publish Date - 2022-07-10T23:59:56+05:30 IST

జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

‘బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడింది’

అమరావతి: జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి బినామీల పేరుతో సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. విజయసాయి దొంగ లెక్కల వల్లే జగన్‌ జైలుకు వెళ్లారని ఇప్పుడు అర్థమైందన్నారు. హైదరాబాద్‌లో 19 కంపెనీలు ఒకే అడ్రస్‌తో ఉన్నాయని, వీటిలో విజయసాయి అల్లుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఇవన్నీ జగన్, విజయసాయి సూట్‌కేసు కంపెనీలన్నారు. 2019లో ఆదాన్ డిస్టలరీకి ఎవరు అనుమతిచ్చారు?, కంపెనీ పెట్టిన రెండున్నరేళ్లకే రూ.2400 కోట్ల మద్యం ఎలా అమ్మారు? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక లెక్కలన్నీ బయటకు తీస్తామన్నారు. 



Updated Date - 2022-07-10T23:59:56+05:30 IST