నెల్లూరు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2022-02-17T21:18:39+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు.
నెల్లూరు: జిల్లాలోనే రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుడూ పునర్విభజన వల్ల జరిగే నష్టాన్ని తెలిపేందుకే దీక్ష చేస్తున్నానన్నారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో స్వార్థరాజకీయం కోసం.. కాంగ్రెస్లోని ఓ పెద్దమనిషి రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని విమర్శించారు. సోమశిల, కండలేరు జలాల కేటాయింపులే ఇంత వరకు జరగలేదన్నారు. నాగార్జున సాగర్ లాంటి దుస్థితి సోమశిల ప్రాజెక్ట్కు వచ్చే పరిస్థితి ఉందని ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.