అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌నకు అనకాపల్లి విద్యార్థిని

ABN , First Publish Date - 2020-08-03T09:43:21+05:30 IST

పట్టణానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని కొల్లి సుదీప అంతర్జాయ స్కాలర్‌షిప్‌ (గూగుల్‌ ఏషియా పొలిటిక్‌ టెక్‌మేకర్‌)నకు ఎంపికైంది.

అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌నకు అనకాపల్లి విద్యార్థిని

 అనకాపల్లి టౌన్‌ : పట్టణానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని కొల్లి సుదీప అంతర్జాయ స్కాలర్‌షిప్‌ (గూగుల్‌ ఏషియా పొలిటిక్‌ టెక్‌మేకర్‌)నకు ఎంపికైంది. ప్రస్తుతం ఈమె విశాఖలోని విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదుతోంది. ఆసియాఖండంలో 48 దేశాలకు చెందిన విద్యార్థులు పోటీపడగా, భారత్‌ నుంచి 39 మంది పాల్గొనగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుదీప ఒక్కరికే ఈ అవకాశం దక్కింది. ఈమెకు ఏడాదికి వెయ్యి డాలర్లు వస్తుందని జార్జిక్లబ్‌ సభ్యుడు కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను జార్జిక్లబ్‌లో ఆదివారం సత్కరించారు. వైసీపీ నాయకులు దిలీప్‌కుమార్‌, జానకిరామరాజు, టీడీపీ నాయకులు జోగినాయుడు, రామచంద్రరావు తదితరులు అభినందించారు.  


Updated Date - 2020-08-03T09:43:21+05:30 IST