APNews: లారీని ఢీకొన్న టాటా మ్యాజిక్ వాహనం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-05-27T13:41:29+05:30 IST

జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

APNews: లారీని ఢీకొన్న టాటా మ్యాజిక్ వాహనం.. ఇద్దరు మృతి

అనకాపల్లి: జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని  టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని తుని గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించారు. కృష్ణా జిల్లా నుండి విశాఖ సింహాచలం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-27T13:41:29+05:30 IST