సీఎం జగన్‌కు కాపులంటే ఎందుకంత కక్ష?: అనగాని సత్యప్రసాద్

ABN , First Publish Date - 2022-02-27T19:02:46+05:30 IST

సీఎం జగన్‌కు కాపులంటే ఎందుకంత కక్ష? అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.

సీఎం జగన్‌కు కాపులంటే ఎందుకంత కక్ష?: అనగాని సత్యప్రసాద్

అమరావతి: సీఎం జగన్‌కు కాపులంటే ఎందుకంత కక్ష? అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కాపులకు రిజర్వేషన్లు, కాపు భవన్లు నిలిపివేసినట్లు..పవన్ సినిమాను నిలిపేస్తారా? అని ప్రశ్నించారు.  ఏ సినిమాకు లేని ఆంక్షలు.. పవన్ సినిమాకే ఎందుకు? అని నిలదీశారు. కాపులకు చంద్రబాబు పెద్దపీట వేస్తే.. జగన్‌రెడ్డి కత్తిపీట వేశారని మండిపడ్డారు. సీఎం తాడేపల్లి ప్యాలెస్‌పై పెట్టిన శ్రద్ధ..కాపు కార్పొరేషన్‌పై ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు. ఒక్క రోజైనా కాపు కార్పొరేషన్‌పై సమీక్ష చేశారా? అని  అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. 

Updated Date - 2022-02-27T19:02:46+05:30 IST