రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-16T05:39:04+05:30 IST
మేడపాడు పీహెచ్సీ సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందినట్టు యలమం చిలి ఎస్ఐ కె.గంగాధరరావు తెలిపారు.
యలమంచిలి, మే 15: మేడపాడు పీహెచ్సీ సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందినట్టు యలమం చిలి ఎస్ఐ కె.గంగాధరరావు తెలిపారు. మేడపాడు గ్రామానికి చెందిన కుడిపూడి సత్యనారాయణ, పెచ్చేటి రాంబాబు (30) బైక్పై చించినాడ వెళ్లి తిరిగి వస్తుండగా మేడపాడు పీహెచ్సీ సమీపంలో ఎదురుగా కారు వస్తుండటంతో బైక్ నడుపు తున్న సత్యనారాయణ సడన్ బ్రేక్ వేయగా వారిరువురు రోడ్డుపై పడిపోయారు. బైక్ వెనుక కూర్చున్న పెచ్చేటి రాంబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. కుడిపూడి సత్యనారాయణకు గాయాలపాలవడంతో పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.