బేగంపేట పీఎస్ పరిధిలో దారుణం

ABN , First Publish Date - 2020-02-18T19:37:14+05:30 IST

హైదరాబాద్: బేగంపేట పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.

బేగంపేట పీఎస్ పరిధిలో దారుణం

హైదరాబాద్: బేగంపేట పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. కృశే గార్డెన్ అపార్టుమెంట్‌లో వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు.. బేగంపేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్‌కు చేరుకొని బాడీని గాంధీ మార్చరీకి తరలించారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా బిల్డింగ్‌పై నుంచి తోసేసి హత్య చేశారా? లేదంటే తానే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-02-18T19:37:14+05:30 IST